టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ తర్వాత పాన్ ఇండియా స్టార్స్గా మారబోతున్నారు.
ఇప్పటికే వారి నెక్స్ట్ ఫిల్మ్స్ పాన్ ఇండియా రేంజ్ అని ప్రకటనలు ఇచ్చేశారు.ఈ సంగతులు పక్కనబెడితే… టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారుతున్న తరుణంలో కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
వారు ఎవరంటే.
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రజెంట్ ‘లవ్ స్టోరి’ మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు.కాగా, శేఖర్ నెక్స్ట్ చేయబోయే మూవీలో కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్నాడు.ఈ చిత్రం ద్వారా ధనుష్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.
ఇకపోతే ‘మహర్షి’ ఫేమ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఈ చిత్రం బైలింగువల్ .తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందబోతుందట.ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఇక ‘జాతి రత్నాలు’ ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ తన నెక్స్ట్ మూవీలో కోలీవుడ్ హీరో శివ కార్తీకేయన్ను డైరెక్ట్ చేయబోతున్నారు.మొత్తంగా కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు.విజయ్ టాలీవుడ్ ఎంట్రీకిగాను ఆయనకు రూ.100కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో టాక్ వినబడుతోంది.హీరో ధనుష్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు, శివకార్తీకేయన్కు రూ.25 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే గతంలో వీరి(ధనుష్, విజయ్, శివ కార్తీకేయన్) చిత్రాలు తెలుగులో డబ్ అయి రిలీజ్ అయ్యాయి.
వాటిలో కొన్నిటిని ప్రేక్షకులు ఆదరించారు కూడా.అయితే, కోలీవుడ్ డైరెక్టర్స్ టాలీవుడ్ హీరోలను డైరెక్ట్ చేస్తుండటం గమనార్హం.
జీనియస్ డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో పాన్ ఇండియా ఫిల్మ్ రాబోతుండగా, లింగు స్వామి డైరెక్షన్లో యంగ్ హీరో రామ్ పోతినేని ఓ చిత్రంలో నటిస్తున్నాడు.