యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ లో ఓం రావత్ దర్శకత్వంలో మైథాలజీ కథాంశంతో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని టి-సిరీస్ భారీ బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా ఆవిష్కరిస్తుంది.
పూర్తిగా గ్రీన్ మ్యాట్ స్టూడియోలో త్రీడీ టెక్నాలజీలో ఈ సినిమాని తెరకెక్కుస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడు పాత్రలో వారియర్ కింగ్ గా కనిపించబోతూ ఉండగా, లంకేశ్ రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో సీత పాత్ర కోసం ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక ఇందులో దశరధుడు పాత్రలో కృష్ణంరాజు నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.
మిగిలిన క్యాస్టింగ్ గురించి ఎలాంటి క్లారిటీ లేకపోయినా తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.సినిమా కోసం ప్రస్తుతం ఆర్టిస్ట్ సెలక్షన్ జరుగుతుందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తుంది.
దర్శకుడు ఓం రావత్ ఈ సినిమా షూటింగ్ జనవరి తర్వాత ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో లక్ష్మణుడు పాత్ర కోసం కోలీవుడ్ హీరో, గద్దలకొండ గణేష్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అధర్వ మురళీని ఫైనల్ చేశారని తెలుస్తుంది.
ఈ పాత్ర చెయ్యడానికి అతను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని ఆవిష్కరిస్తున్నందున అందుకు తగ్గట్లే క్యాస్టింగ్ సెలక్షన్ ఉండేలా దర్శకుడు ఓం రావత్ చూసుకుంటున్నట్లు తెలుస్తుంది.
రామాయణంలో ఇప్పటి వరకు ఎవరూ చూడని కోణాన్ని దర్శకుడు ఇందులో ఆవిష్కరించబోతున్నారని టాక్ నడుస్తుంది.