టాలీవుడ్ లో తమిళ హీరో హీరోయిన్ లతో పాటుగా తమిళ దర్శకులు కూడా టాలీవుడ్ హీరోలతో సినిమాలు నిర్మిస్తూ తెలుగులో కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంటున్నారు.ఇక తమిళంలో టాప్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలచందర్ తెలుగులో కూడా అంతులేని కథ, మరో చరిత్ర, రుద్రవీణ లాంటి సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.ఇక కేఎస్ రవికుమార్, ఎస్.ఎ.చంద్రశేఖర్, విసు,పి.వాసు ఇలా ఎంతో మంది తమిళ దర్శకులు తెలుగులో ఎన్నో మంచి మంచి సినిమాలను తనకు ఎక్కించారు.
తమిళ దర్శకుడు అయిన మణిరత్నం ను తెలుగు ప్రేక్షకులు తెలుగు దర్శకుడిగానే భావిస్తూ ఉంటారు.
అదేవిధంగా హీరో ప్రభుదేవా లారెన్స్ వీరిద్దరూ కూడా తెలుగు ఇండస్ట్రీలో దర్శకులుగా రాణించిన విషయం తెలిసిందే.ప్రభుదేవా తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
లారెన్స్ మాస్ లాంటి సినిమాలు చేసి భారీ విజయాలను సొంతం చేసుకున్నారు.
ఇక స్టాలిన్, మురుగదాస్ ఒక తరహా సినిమాలను తెరకెక్కించారు.సెల్వరాఘవన్ కూడా 7G బృందావన కాలనీ,ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సినిమాలతో తన మార్కును నిరూపించుకున్నారు.ఇలా ఎంతో మంది తమిళ దర్శకులు తెలుగులో సినిమాలు తెరకెక్కిస్తు ఇటు యూత్ ను,అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.
గౌతమ్ మీనన్ ఏ మాయ చేశావే సినిమాతో,ఇంద్రుడు చంద్రుడు సినిమాతో సురేశ్ కృష్ణ, శౌర్యం సినిమాతో శివ వారి సత్తాను నిరూపించుకున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ప్రస్తుతం కొందరు తమిళ దర్శకులు తెలుగు బాటపడుతున్నారు.ప్రస్తుతం రామ్ తో లింగుసామి ది వారియర్ సినిమాను రూపొందిస్తుండగా, రామ్ చరణ్ తో శంకర్ ఒక సినిమా చేస్తున్నాడు.
అలాగే గోపీచంద్ తో ఒక సినిమా చేయడానికి హరి కూడా రంగంలోకి దిగగా నాగచైతన్యతో సినిమా చేయడానికి వెంకట్ ప్రభు సిద్ధమవుతున్నాడు.తమిళ దర్శకులు ఇప్పుడు తెలుగు హీరోలతో సినిమాలు చేసి ఆ సినిమాలను తమిళంలో కూడా విడుదలయ్యేలా చూసుకోవడం ఇప్పటి ట్రెండ్ గా మారిపోయింది.మరి తెలుగు హీరోలతో సినిమాలు చేయాలి అనుకుంటున్న తమిళ దర్శకులు సక్సెస్ అవుతారా? అలాగే సినిమాలు హిట్ అవుతాయి లేదా అన్నది చూడాలి మరి.