తమిళ హీరోలు విశాల్ మరియు శరత్ కుమార్ల మధ్య వైరం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.మొన్నటి వరకు నటుల సంఘం నడిగర్కు అధ్యక్షుడిగా ఉన్న శరత్ కుమార్ను పట్టు బట్టి అధ్యక్ష పీఠం నుండి విశాల్ లాగేసిన విషయం తెల్సిందే.
ఇంతో ఇష్టపడి చేస్తున్న పదవి కోల్పోవడంతో శరత్ కుమార్ కుంగి పోయాడు.ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న శరత్ కుమార్ను కొన్నాళ్లుగా విశాల్ నడిగర్కు చెందిన గత పది సంవత్సరాల లెక్కలు తేల్చాలి అంటూ ఒత్తిడి తెస్తున్నాడు.
దాంతో శరత్ కుమార్ కూడా విశాల్ విమర్శలకు తీవ్రంగానే స్పందిస్తూ వచ్చాడు.
లెక్కల గురించి ఎంతగా అడిగినా చెప్పక పోవడంతో ఇక తప్పని పరిస్థితుల్లో శరత్ కుమార్పై పోలీస్ కేసును సైతం విశాల్ పెట్టాడు.
నడిగర్ సంఘంకు చెందిన విలువైన ఆస్తులను శరత్ కుమార్ మరియు గత సభ్యులు నొక్కేశారు అని, వాటి లెక్కలు లేల్చాలి అంటూ పోలీసులకు విశాల్ ఫిర్యాదు చేశాడు.దాంతో విచారణ ప్రారంభించిన పోలీసులు త్వరలోనే శరత్ కుమార్ను ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది.
కోలీవుడ్కు చెందిన ఈ ఇద్దరు స్టార్స్ ఇలా వైరం పెంచుకోవడంతో ఇండస్ట్రీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.ఇండస్ట్రీలో ఇలాంటి విభేదాలు ఉండటం మంచిది కాదు అని, ఈ వివాదాలకు సత్వరమే పరిష్కారం చూడాలని కోరుకుంటున్నారు.