ఈ మధ్యకాలంలో డిప్రెషన్ కారణంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు వదిలేస్తున్నారు.ఈ జెనరేషన్ లో డిప్రెషన్ అనేది అతి పెద్ద సమస్యగా మారింది.
దీని నుంచి చాలా మంది బయటపడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కువ మంది మాత్రం ఈ మానసిక సమస్య కారణంగా జీవితంలో అనుకున్న లక్ష్యాల్ని అందుకోలేక కృంగుబాటుతో చివరికి ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు.ఎప్పుడో పదకుండు ఏళ్ళ క్రితం ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి, అలాగే సిల్క్ స్మిత చనిపోవడానికి కారణం ఈ డిప్రెషన్ అనేది చాలా మందికి తెలిసిందే.
అలాగే బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రాణాలు తీసుకోవడానికి కారణం కూడా ఈ డిప్రెషనే.
జీవితంలో ఏదో అనుకుంటే వాటిని సకాలంలో అందుకోలేకపోతే, అలాగే ఆర్ధిక సమస్యలు తట్టుకోలేని స్థాయిలో ఉంటే, కుటుంబ బంధాలు విచ్చిన్నం అయ్యి ఆ ఆలోచనలు పదే పదే బాధిస్తూ ఉంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం అలవాటుగా మారిపోయింది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా కన్నడ నటి ఇలాగే డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుంది.ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు డిప్రెషన్ నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నాలు చేసింది.
అయినా కూడా దాని నుంచి బయటపడలేక చివరికి ప్రాణాలు తీసుకుంది.ఇదే దారిలో తాజాగా కోలీవుడ్ లో ఓ యువ నటుడు ప్రాణాలు తీసుకున్నాడు.
ధనుష్ తో కలిసి ఎన్నై నొక్కి పాయమ్ అనే సినిమాలో నటించిన శ్రీ వాత్సవ్ ఆత్మహత్య చేసుకున్నాడు.షూటింగ్ ఉందని ఇంట్లో వాళ్లకి చెప్పి వెళ్లిన అతను తన ఫ్యామిలీ గెస్ట్ హౌస్ లోనే ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
ఈ ఘటన ఇప్పుడు కోలీవుడ్ లో విషాదంగా మారింది.ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు ఇలా ప్రాణాలు తీసుకోవడంపై పలువురు సహా నటులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.