కొల్లేరు అంబాసిడర్ గా గూడకొంగ (స్పాట్ బిల్డ్ పెలికాన్)ను ఎంపిక చేశారు.ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్.
ప్రతాప్ కుమార్ బుధవారం వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ కార్యక్రమంలో భాగంగా ఈ పక్షిని అంబాసిడర్ గా గుర్తించినట్లు చెప్పారు.
గుంటూరులోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వారం దేశ వ్యాప్తంగా చిత్తడినేలల పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ప్రతి రాష్ట్రంలో చిత్తడి నెలకు సంబంధించిన ఒక పక్షి లేదా అక్కడి వైవిధ్యమైన జంతువు అంబాసిడర్ గా ఎంపిక చేయాల్సి ఉందన్నారు.
ఏపీలో గూడకొంగను ఎంపిక చేసినట్లు తెలిపారు.
ప్రపంచంలో ఉన్న (స్పాట్ బిల్డ్ పెలికాన్) పెలికాన్ పక్షులు 40% ప్రతి ఏడాది కొల్లూరుకు వస్తాయని అందుకే దీన్ని అంబాసిడర్ గా ఎంపిక చేశామన్నారు.చిత్తడి నేలల పరిరక్షణ కోసం వెట్ ల్యాండ్ మిత్రాస్ ను నిర్మిస్తామని తెలిపారు.
స్థానికంగా సేవా దృక్పథం ఉన్న వారిని ఇందుకు ఎంపిక చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఎఫ్ఎల్ సెల్వం తదితరులు పాల్గొన్నారు.