భారత క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, జస్ ప్రిత్ బుమ్రాలపై ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆసీస్ అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు పెద్దపెద్ద దుమారాన్నే రేపాయి.సాధారణంగానే ఫీల్డ్ లోనే అగ్రెసివ్ గా ఉండే భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసీస్ అభిమానులు భారత క్రికెటర్లపై చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని, అసలు సిసలు రౌడీలాగా ఆసీస్ అభిమానులు ప్రవర్తించారని, జాత్యహంకార వ్యాఖ్యలు అసలు సహించరానివని విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు, వరుసగా ప్రతి మ్యాచ్ లోనూ ఇలా జరుతుండడం, వెంటనే ఎంపైర్లకు ఫిర్యాదు చేయడంతో ఆ ఆరుగురు అభిమానులను పోలీసులు స్టేడియం నుండి బయటకు పంపించివేశారు.ఏది ఏమైనా ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్ట కరమని, ఈ ఘటనను ఎవరూ సమర్థించరని, మొదట ఇటువంటి ఘటనలు జరిగినప్పుడే ఎవరితే ఇటువంటి ఘటనకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షిస్తే, మరల ఇటువంటి ఘటనలు జరగడానికి ఆస్కారం ఉండదని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి ఘటనలు జరిగితే ఆటగాళ్లు మానసిక స్థైర్యం కోల్పోతారని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని క్రికెట్ అభిమానులు సైతం కోరుతున్నారు.