టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్లో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ఒకరు.ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఏపీ రాజకీయాల్లో తనదదైన పాత్ర పోషిస్తున్నారు.
ఈ క్రమంలోనే కోడెల వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని, తన వారసులను రాజకీయారంగ్రేటం చేయించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు గుంటూరు జిల్లాలో వార్తలు జోరుగా ఆరేడు నెలలుగా ట్రెండ్ అవుతున్నాయి.
గతంలో నరసారావుపేట నుంచి ఐదుసార్లు గెలిచిన కోడెల ప్రస్తుతం సత్తెనపల్లికి మారారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేని కోడెల తన కుమారుడు కోడెల శివరాంతో పాటు కుమార్తె విజయలక్ష్మి ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని చంద్రబాబును ఇప్పటికే కోరినట్టు తెలుస్తోంది.
కోడెల చేతిలో ప్రస్తుతం నరసారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి.
ఇక గుంటూరు వెస్ట్ సీటును తన కొడుక్కి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.ఇక కుమార్తె విజయలక్ష్మిని సత్తెనపల్లి లేదా నరసారావుపేట నుంచి బరిలో దించొచ్చు.
లేదా శివరాం అయినా ఇక్కడ పోటీ చేయవచ్చు.ఈ మూడు సీట్లతో పాటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కోడెలకు పల్నాడులోన మరో రెండు కొత్త నియోజకవర్గాలు ఆప్షన్లు అవుతాయి.
శివరాం ఇప్పటికే తండ్రి తరపున సత్తనపల్లి, నరసారావుపేటలో అన్ని వ్యవహారాలు చక్కపెడుతున్నాడు.ఇక కోడెల కూతురు విజయలక్ష్మి భర్త మనోహర్ గుంటూరులో వైద్యుడిగా ఉన్నారు.
మరి కోడెల ఆలోచనలు ఎలా ఉన్నా ఆయన్ను చంద్రబాబు వదులుకుని ఆయన వారసులకు టిక్కెట్లు ఇస్తారా ? అన్నది సందేహమే.