కోడెల మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.అనుమానాస్పద మృతిగా కేసును ఫైల్ చేసిన పోలీసులు ఇంట్లో సభ్యులను, పని వారిని చుట్టు పక్కల వారిని ఎంక్వౌరీ చేయడం జరిగింది.
ఈ సంద్బంగా పోలీసులు కోడెల కూతురు విజయలక్ష్మిని ప్రశ్నించారు.ఆమె తన తండ్రి మరణంపై ఎలాంటి అనుమానాలు తమకు లేవు అంటూ స్పష్టం చేసింది.
ఇతర కుటుంబ సభ్యులు కూడా అదే విషయాన్ని నిర్ధారించారు.
విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.
ఈరోజు ఉదయం మా నాన్నగారు ఫస్ట్ ప్లోర్కు వెళ్లారు.అక్కడ కొంత సమయం గడిపి వస్తారనుకున్నాం.
ఎంత సేపైనా రాకపోవడంతో పైకి వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకుని కనిపించారు.డ్రైవర్ మరియు గన్ మన్ సాయంతో తన తండ్రిని హాస్పిటల్కు తీసుకు వచ్చినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు.
తన తండ్రి గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు.ఆయన బాగా డిస్ట్రబ్ అయ్యారు.
మానసిక ప్రశాంతత కోల్పోవడం వల్లే ఆ పని చేసి ఉంటారని తాము భావిస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు.ఇతర కుటుంబ సభ్యులు సైతం అదే విధంగా పోలీసుల ఎంక్వౌరీలో మాట్లాడటం జరిగింది.
దాంతో కోడెల మృతి ఆత్మహత్య వల్లే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.