కేసీఆర్‌కు అహం పెరిగింది ఓడించాల్సిందే

హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ తరపున కోదండరాం ప్రచారం జరిపాడు.ఉత్తమ్‌ తో కలిసి పలు ప్రాంతాల్లో కలియదిరిగిన కోదండరాం మాట్లాడుతూ కేసీఆర్‌కు అహం బాగా పెరిగి పోయింది.

 Kodandaram Support On Uttam Kumar Reddy-TeluguStop.com

నియంతృత్వంతో ప్రవర్తిస్తున్నాడు.అందుకే ఆయన్ను గెలిపించవద్దని ప్రజలకు పిలుపునిచ్చాడు.

ఎట్టపరిస్థితుల్లో హుజూర్‌ నగర్‌లో కారు గుర్తుకు ఓటు వేయవద్దని కాంగ్రెస్‌ను మాత్రమే గెలిపించాలంటూ ఆయన ప్రజలను కోరాడు.కేసీఆర్‌ ఆర్టీసీని విడగొట్టి ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడంటూ కోదండరాం అన్నాడు.

కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న ఉత్తమ్‌ పద్మావతి గారిని గెలిపిస్తేనే నియోజక వర్గం ప్రశాంతంగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హుజూర్‌ నగర్‌లో పోలీసులను ఉపయోగించుకుని రాజకీయం చేసే వ్యక్తికి ఓటు వేయాల్సిన అవసరం లేదని, నియోజక వర్గం మొత్తం అల్ల కల్లోలం అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోదండరాం కోరాడు.

ఈ సందర్బంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ పతనం ఇక్కడినుండే మొదలు అవ్వాలంటే ప్రజలను ఉద్దేశించి కోరాడు.మొత్తానికి హుజూర్‌ నగర్‌లో రాష్ట్ర ముఖ్య నేతల ప్రచారంతో పరిస్థితి హీట్‌ ఎక్కింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube