హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తరపున కోదండరాం ప్రచారం జరిపాడు.ఉత్తమ్ తో కలిసి పలు ప్రాంతాల్లో కలియదిరిగిన కోదండరాం మాట్లాడుతూ కేసీఆర్కు అహం బాగా పెరిగి పోయింది.
నియంతృత్వంతో ప్రవర్తిస్తున్నాడు.అందుకే ఆయన్ను గెలిపించవద్దని ప్రజలకు పిలుపునిచ్చాడు.
ఎట్టపరిస్థితుల్లో హుజూర్ నగర్లో కారు గుర్తుకు ఓటు వేయవద్దని కాంగ్రెస్ను మాత్రమే గెలిపించాలంటూ ఆయన ప్రజలను కోరాడు.కేసీఆర్ ఆర్టీసీని విడగొట్టి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడంటూ కోదండరాం అన్నాడు.
కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న ఉత్తమ్ పద్మావతి గారిని గెలిపిస్తేనే నియోజక వర్గం ప్రశాంతంగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్లో పోలీసులను ఉపయోగించుకుని రాజకీయం చేసే వ్యక్తికి ఓటు వేయాల్సిన అవసరం లేదని, నియోజక వర్గం మొత్తం అల్ల కల్లోలం అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా కాంగ్రెస్కు ఓటు వేయాలని కోదండరాం కోరాడు.
ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ కేసీఆర్ పతనం ఇక్కడినుండే మొదలు అవ్వాలంటే ప్రజలను ఉద్దేశించి కోరాడు.మొత్తానికి హుజూర్ నగర్లో రాష్ట్ర ముఖ్య నేతల ప్రచారంతో పరిస్థితి హీట్ ఎక్కింది.