టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ గురువారం సాయంత్రం అకస్మాత్తుగా… ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.జనగామ సీటు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడడంతో ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
జనగామ సీటును కోదండరామ్ కు ఇవ్వాలనే ప్రతిపాదనను కాంగ్రెసు సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తొలి జాబితాలో తన పేరు లేకపోవడం, జనగామ సీటును కోదండరామ్ కు కేటాయిస్తున్నట్లు వార్తలు రావడం జరిగిన వెంటనే పొన్నాల ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.అప్పటి నుంచి ఆయన అక్కడే మకాం వేశారు.ఈలోగా సీట్ల పంచాయతీ తేలకపోవడంతో టిజెఎస్ తాను పోటీ చేసే స్థానాలను ప్రకటించింది.
అందులో జనగామ సీటు కూడా ఉంది.ఈ స్థితిలో కోదండరామ్ ను రాహుల్ గాంధీ ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.