తేలని లెక్క ! పోయిరావలె హస్తినకు !

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ గురువారం సాయంత్రం అకస్మాత్తుగా… ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.జనగామ సీటు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడడంతో ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.

 Kodandaram Leaves For Delhi To Meet Rahul Gandhi-TeluguStop.com

జనగామ సీటును కోదండరామ్ కు ఇవ్వాలనే ప్రతిపాదనను కాంగ్రెసు సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తొలి జాబితాలో తన పేరు లేకపోవడం, జనగామ సీటును కోదండరామ్ కు కేటాయిస్తున్నట్లు వార్తలు రావడం జరిగిన వెంటనే పొన్నాల ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.అప్పటి నుంచి ఆయన అక్కడే మకాం వేశారు.ఈలోగా సీట్ల పంచాయతీ తేలకపోవడంతో టిజెఎస్ తాను పోటీ చేసే స్థానాలను ప్రకటించింది.

అందులో జనగామ సీటు కూడా ఉంది.ఈ స్థితిలో కోదండరామ్ ను రాహుల్ గాంధీ ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube