జయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో బాంబే కాలనీలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు తో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొడాలి నాని కీలక కామెంట్లు చేశారు.ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తండ్రి కొడుకులకు పిచ్చి పరాకాష్టకు చేరింది అని పేర్కొన్నారు.జగన్ దెబ్బకు చంద్రబాబు కుప్పానికి వెళ్లిపోయారని సెటైర్లు వేశారు.
అదే రీతిలో లోకేష్ కి చిన్న మెదడు చితికి పోయింది అని అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు.జగన్ గన్ లో బుల్లెట్ లేవు అంటూ లోకేష్ చేసిన కామెంట్లపై కూడా రియాక్ట్ అయ్యారు.
గన్ లో బుల్లెట్లు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు కుప్పానికిలోకేష్ మంగళగిరి నుండి హైదరాబాదులో పడ్డారు అంటూ మంత్రి కొడాలి నాని పేర్కొన్నరు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని, వాగ్దానాన్ని నెరవేరుస్తూ జగన్ అందిస్తున్న పాలన తండ్రి కొడుకులకు నిద్ర పట్టనివ్వడం లేదు అన్నట్టు కొడాలి నాని స్పష్టం చేశారు.
.