అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని తెలియజేస్తూ పాదయాత్ర చేస్తున్నారు.
ఈ పాదయాత్రకి వైసీపీ మినహా మిగతా రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.కాగా అమరావతి రైతులు చేస్తున్న ఈ ఉద్యమంపై తాజాగా మాజీ మంత్రి వైసిపి నేత ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి రైతుల చేస్తున్న ఉద్యమాన్ని దేవుళ్ళు మరియు రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రజలు హర్షించారని పేర్కొన్నారు.రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు వెనకబడి ఉన్నారు.రాష్ట్ర సంపద మరియు అభివృద్ధి ఒకేచోట ఉంటే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయి.గతంలో ఈ రీతిగానే హైదరాబాద్ నీ కోల్పోయి అనాధలు అయ్యాం.
ప్రజల కష్టాన్ని ఒకే చోట పెడితే మళ్లీ హైదరాబాద్ పరిస్థితే వస్తోంది అని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.