కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకి కోపం అన్నట్టుగా తయారయ్యింది ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.జగన్ పార్టీలో ఉన్న అత్యంత విశ్వసనీయ నాయకుడు కోడలి నాని ఇప్పుడు జగన్ ను ఇరకాటంలో పడేసాడు.
ఈ విషయంలో జగన్ తన నిర్ణయం సూటిగా చెప్పలేక సతమతం అవుతున్నాడు.ఇంతకీ విషయం ఏంటి అంటే…? తెలంగాణ లో మహా కూటమి లో టీడీపీ తరపున దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు.ఈ నేపథ్యంలో కోడలి నానికి నందమూరి ఫ్యామిలీతో ఉన్న అనుబంధం దృష్ట్యా … ఆమెకు రాజకీయంగా సపోర్ట్ అందించాలనే ఆలోచనలో నాని ఉన్నాడట.
జగన్కు ఫోన్ చేసిన నాని.సుహాసిని తరఫున ప్రచారానికి సంబంధించి తన మనసులోని మాటను నేరుగా చెప్పేశారట.నాని మాటలతో జగన్ ఒక్కసారిగా షాక్ తిన్నాడట.
తాను వద్దన్నా నాని వింటాడో లేదోనని అనుమానించిన జగన్.ప్రస్తుతానికి విషయాన్ని పక్కనపెట్టాయలని భావించారట.
అందుకే తాను కొంచెం బిజీగా ఉన్నానని.ఈ విషయంపై తర్వాత మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేశారట.
నాని చెప్పిన విషయంపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది.