పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రుల కౌంటర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా వైసీపీ మంత్రి కొడాలి నాని పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశంలో పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి రికార్డు సృష్టించిన ఏకైక పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ అని సెటైర్లు వేశారు.ఎమ్మెల్యే గా కూడా గెలవలేని నువ్వు ఇటీవల పరిషత్ ఎన్నికలలో పార్టీకి వచ్చిన కొన్ని స్థానాలను చూసుకుని భుజాలు ఎగరేసుకుంటూఅది కూడా ఒకటో రెండో జడ్పిటిసి స్థానాలు.
గెలుచుకొని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కొడాలి నాని సీరియస్ అయ్యారు.
ఇక 10 వేల మంది ఎంపీటీసీలు ఉంటే అందులో 160 మంది 170 మందో.
ఎంపీటీసీ స్థానాలు రావడం ఇది ఆయన బలం అంటూ వ్యంగ్యంగా డైలాగులు వేశారు.వచ్చిన వీటికే ఏదో ఊహించేసుకొని.
జగన్ నీ మాజీ ముఖ్యమంత్రి చేస్తాను, 15 స్థానాలకే పరిమితం చేస్తాను అనటం పై సీరియస్ అయ్యారు. రాజకీయాలు చేయలేదు అంటున్న నువ్వు, ఇప్పటిదాకా చంద్రబాబు బూట్లు నాకావా మోడీ గారి బూట్లు నాకావా అని ప్రశ్నించారు.
గంత ఎన్నికలలో జగన్ ను ఓడించటానికి ఎస్సీ, ఎస్టీ ఓట్లు చీల్చడానికి మాయావత కాళ్ళపై పడ్డావు అంటూ పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని సీరియస్ కామెంట్లు చేశారు.
2014, 2019 ఎన్నికలలో జగన్ సింగిల్ గానే పోటీ చేశారు.వచ్చే ఎన్నికలలో కూడా సింగిల్ గానే పోటీ చేస్తారు, సింహం సింగిల్ గానే వస్తుంది అని కొడాలి నాని చెప్పుకొచ్చారు.నీ పార్ట్నర్ చంద్రబాబు అదే రీతిలో నీ మిత్రపక్షం బీజేపీ, కుదిరితే కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టులతో దేశంలో మిగతా అన్ని పార్టీలు కలుపుకొని కలిసి వచ్చి పోటీ చేసిన.
నువ్వు గెలవలేని పరిస్థితి.నీకు వైయస్ జగన్ కి పోలిక ఏంటి అంటూ పవన్ పై ఓ రేంజ్ లో కొడాలి నాని ఫైర్ అయ్యారు.సోనియాగాంధీనే లెక్కచేయలేదుఅసలు నిన్ను పట్టించుకుంటాడా మా నాయకుడు…నువ్వెంత అంటూ పవన్ పై కొడాలి నాని హై వోల్టేజ్ డైలాగులు వేశారు.