చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించిన కొడాలి నాని..!!

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.ప్రజలు ఓడించారని ప్రజలపై నోటికి వచ్చినట్లు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 Kodali Nani Serious Comments On Chandrababu Tirupathi, Chandrababu, Kodali Nani-TeluguStop.com

టీడీపీ నాయకులు కూడా ఇదే రీతిలో మాట్లాడుతున్నారని .ప్రజలను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు అని కొడాలి నాని హెచ్చరించారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు మూడు లక్షల 60 వేల కోట్ల అప్పులు చేసింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించి అల్జీమర్స్ వచ్చి మర్చిపోయారా? అని సెటైర్లు వేశారు.కరోనా లాంటి కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకోవడం కోసం వారికి ఆహారం కోసం జగన్ అప్పులు చేయడం జరిగింది అని, అప్పుడు ఇప్పుడు కాకపోతే పది సంవత్సరాల తర్వాత తీర్చుకోవచ్చు ప్రజల కష్టాలు తీర్చటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.

అందువల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు రికార్డు స్థాయిలో వైసీపీని గెలిపించారని, ఇందుమూలంగా  తెలుగుదేశం పార్టీ నాయకులు కుక్కలా పడి ఏడుస్తున్నారు అని అన్నారు.చంద్రబాబు డైరెక్షన్ లో నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించిన గానీ ఏం చేయలేకపోయారని పేర్కొన్నారు.

రాబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా స్వామి ఆశీస్సులతో ఐదు లక్షలకు పైగా మెజారిటీతో వైసిపి గెలవటం గ్యారెంటీ అని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube