ఏపీ రాజకీయాలను గుడివాడ క్యాసినో గొడవ కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.సంక్రాంతి పండుగ సందర్భంగా మంత్రి కొడాలి నాని నియోజకవర్గంలో క్యాసినో నిర్వహించారని గోవా సంస్కృతిని ఏపీకి తీసుకువచ్చారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నాయి.
ఈ విషయంలో చంద్రబాబు మరియు లోకేష్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు గత కొద్ది రోజుల నుండి మీడియా ముందు నానా హడా విడి చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే ఏకంగా “ఛలో గుడివాడ” అనే కార్యక్రమం కూడా నిర్వహించారు.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఈ గొడవకు సంబంధించి ఓ ప్రముఖ మీడియా ఛానల్ లో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ….నా మీద ప్రేమతోనే గన్నవరం ఎమ్మెల్యే వంశీ.కార్యక్రమాలు నిర్వహించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.కాని నా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు.ప్రజలు ఏం చేస్తారో వారికే వదిలేయండి. సీఎం జగన్ ఈ విషయం గురించి నన్ను అడగలేదు.
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో సీఎం అని తెలుసుకుంటారు.అసలు ఇది చంద్రబాబు మొదలు పెట్టిన సంస్కృతి అంటూ కొడాలి నాని.
సదరు మీడియా ఛానల్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.కావాలని చంద్రబాబు తన మనుషులతో నన్ను తిట్టిస్తున్నాడని పేర్కొన్నారు.