వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మంత్రి కొడాలి నాని దూకుడు తగ్గిందా? ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన తీవ్ర మనస్తాపా నికి గురయ్యారా? అంటే.ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్లు.
వాస్తవానికి ఆది నుంచి కూడా దూకుడు ఉన్న నాయకుడిగా కొడాలి నానికి పేరుంది.ముఖ్యంగా వైసీపీని కాపాడేందుకు, టీడీపీపై విరుచుకుపడేందుకు కొడాలి తనదైన శైలిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే.
ఎవరు ప్రభుత్వంపై విమర్శలు చేసినా.తనదైన శైలిలో ఆయన చేసే కామెంట్లు.
అందరికీ తెలిసిందే.మరీ ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై నాని చేసిన విమర్శలు ఇటీవల కాలంలో హాట్ టాపిక్గా మారాయి.
ప్రధానంగా దేవాలయాలపై దాడుల విషయంలో చంద్రబాబుపై కొడాలి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.ఇక, గుడివాడలో పవన్ కళ్యాణ్ పర్యటించిన సమయంలో చేసిన వ్యాఖ్యలకు కూడా కొడాలి తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.
ఇంతవరకు బాగానే ఉంది.ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.
అయితే.అనూహ్యంగా రెండు రోజులుగా కొడాలి మౌనం పాటిం చారు.
రాష్ట్రంలో రామతీర్థం ఘటనను టీడీపీ నాయకులు, బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నా.ఆయన ఎక్కడా మాట్లాడడం లేదు.
దీనికి కారణం ఏంటి? ఎందుకు అనూహ్యంగా మౌనం పాటిస్తున్నారు? అనే అంశాలు ఆసక్తిగా మారాయి.
దీనికి వైసీపీ సీనియర్లు చెబుతున్న మాట.గుడివాడలో ఇటీవల జరిగిన పేకాట శిబిరాలపై దాడులే కారణమని అంటున్నారు.నాలుగు రోజుల కింద గుడివాడలోని తమిరశలో ఉన్న చేపల చెరువుల మధ్యలో ఉన్న శిబిరాల్లో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో ఈ వివాదం.మంత్రి కొడాలి నాని చుట్టూ తిరిగింది.ఈ నేపథ్యంలో ఉద్దేశ పూర్వకంగా కొందరు వైసీపీ నేతలు.ఈ విషయాన్ని పోలీసులకు ఉప్పందించారనే అనుమానాలు ఉన్నాయి.
అయితే.తనకు సన్నిహితంగానే ఉంటూ.ఈ వివాదంలోకి తనను లాగారనే అభిప్రాయంతో ఉన్న కొడాలి నాని.మనస్తాపంతో ఉన్నారని వైసీపీ సీనియర్లు గుసగుస లాడుతున్నారు.మొత్తానికి ఈ వివాదం ఇప్పటితో అంతం అవుతుందా? లేక.మున్ముందు పెరిగి పెద్దదవుతుందా? అనేది చూడాలని అంటున్నారు.ఇప్పటికైతే.కొడాలి మౌనం పాటించడం మాత్రం సంచలనంగానే చర్చ సాగుతుండడం గమనార్హం.