ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో దళితులకు చెందిన అసైన్డ్ భూముల కొనుగోలు విషయంలో చంద్రబాబు హయాంలో అవకతవకలు జరిగినట్లు ఇటీవల సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ విషయంపై వైసీపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
త్వరలో సీఐడీ విచారణకు హాజరు కాబోతున్న చంద్రబాబును అవసరమైతే అరెస్టు చేసే అవకాశం ఉందని కీలక కామెంట్లు చేశారు.
అప్పట్లో సిఆర్డిఏ చైర్మన్ గా తనని తానే ప్రకటించుకున్న ఘనుడు చంద్రబాబు అని, అంత మాత్రమే కాక ఇష్టానుసారం అయిన జీవోలు విడుదల చేసి దళితులను మోసం చేసే 500 కోట్లకు పైగా కాజేశారని కొడాలి నాని ఆరోపించారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ చేయటం వల్లే దళితులను బెదిరించి వారి భూములను చంద్రబాబు బినామీలు నాకు ఉన్నారని పేర్కొన్నారు.వారిదగ్గర తక్కువ ధరకు కొని అమరావతిని రాజధానిగా ప్రకటించిన తరువాత అధిక ధరకు ప్రభుత్వానికి చంద్రబాబు బినామీలు అమ్మటం జరిగిందని …రూల్స్ కి వ్యతిరేకంగా అసైన్డ్ భూముల విషయంలో చంద్రబాబు మరియు ఆయన అనుచరులు వ్యవహరించారని .అందువల్లే వాళ్ళకి నోటీసులు పంపించినట్లు స్పష్టం చేశారు.ఈ విషయంలో అవసరమైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టే అవకాశం ఉందని కొడాలి నాని పేర్కొన్నారు.