ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బిజెపి నాయకులు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు.
కచ్చితంగా వినాయక చవితి పండుగలు బహిరంగంగా జరుపుతామని.మరి కొంతమంది నాయకులు మీడియా ముందే కామెంట్లు చేస్తున్నారు.
ఇటువంటి తరుణంలో వైసీపీ మంత్రి కొడాలి నాని బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై స్పందించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీకి అడ్రస్ లేదని.
రావాలని మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుందని పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవడం కోసం.బిజెపి నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
దేశ వ్యాప్తంగా వినాయక చవితి పండుగ పై కేంద్రం ఎటువంటి ఆంక్షలు విధించిందో.అవే ఆంక్షలు ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని.కేంద్రం యొక్క ఆదేశాలనే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తుందని కొడాలి నాని పేర్కొన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి అన్ని మతాలు అంటే గౌరవమని.
పేర్కొన్నారు.వినాయక చవితి పండుగను అడ్డంపెట్టుకుని బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకులు పొలిటికల్ మైలేజ్ సంపాదించడం కోసం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.
దేశవ్యాప్తంగా కేంద్రం యొక్క ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితికి విధించడం జరిగింది అని కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు.