జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రిందట గుడివాడ పర్యటనలో భాగంగా అక్కడి మంత్రి కొడాలి నాని, వైసీపీ ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రమైన విమర్శలు చేశాడు.ఆ విషయంపై అధికార పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పై మాటల యుద్దానికి దిగారు.
ఈ నేపథ్యంలోనే గుడివాడ మంత్రి కొడాలి నాని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశాడు.జగన్ ను పవన్ ఒక్క మాట అంటే మేము వంద మాటలు అంటాం అన్నాడు.
మా నాయకుడిపై విమర్శలు చేసే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదు అన్నాడు.దమ్ముంటే నా చొక్కా పట్టుకోవాలని ఛాలెంజ్ చేశాడు.ఒక్క తన్ను తంతే పక్క దేశంలో వెళ్ళి పడుతావు అన్నాడు.ఇది సినిమా కాదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అన్నాడు.
నువ్వు కొట్టగానే పది మంది పడిపోవడానికి సినిమా కాదని ఎద్దేవా చేశాడు.పేరుకు మాత్రమే జనసేన పార్టీ అని చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ చదువుతాడాని విమర్శించాడు.
చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ ల కోసం పవన్ కళ్యాణ్ పని చేస్తాడు అన్నాడు.తన కోసం తప్ప రైతుల కోసం పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడరు అన్నాడు.