గుడివాడ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబు పై ఘాటైన పదజాలంతో విమర్శలు చేశాడు.అందుకు కారణం వైసీపీ నేతలు టిడిపి నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై దాడి చేశారు అని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపైన తన మాటలతో విరుచుకుపడ్డాడు.
ఈ సందర్భంలో చంద్రబాబు బతుకే ఒక అబద్దాల బతుకు అని అన్నాడు.శవ రాజకీయాలు చేసే చంద్రబాబు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నాడు.
ఆ నాడు ఎన్టిఆర్ పై మల్లెల పద్మనాభం తో దాడి చేయించి రాజకీయ స్వలాభం పొందాడు.పట్టబి రామ్ పై దాడికి వైసీపీ ఎలాంటి సంబందం లేదు.
స్వగృహ ఫుడ్స్ విషయంలో నారా లోకేష్ కు పట్టాభికి మధ్య గొడవలు ఉన్నాయి టిడిపి లోని కొంత మంది నేతలే ఈ దాడి చేయించారని ఆరోపించాడు.
టిడిపి పార్టీ లోని ముఖ్యంగా ఆక్టివ్ గా ఉన్న నాయకులు గాని కార్య కర్తలు గాని తెలుసు కోవాలిసింది ఏమిటి అంటే మీరు ఓ పాము తో ఉన్నారు.
ఆ పాము తన పిల్లలను తానే తినేస్తది.అదే విదంగా చంద్రబాబు ఆలోచన ధోరణిలోనే కూడా అదే విదంగా ఉందని ఉన్నాడు.రాజకీయంగ జగన్ ను బ్రష్టు పట్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు.రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి చంద్రబాబు ఇలాంటి దాడులు చేయిస్తు ప్రజల్లో ఓ రకమైన భయం పుట్టించి వారికి అండగా నేను ఉన్నానని చెబుతూ సింపతి కొట్టేయలని చూస్తున్నాడు.
ఎస్ఈసి యాప్ కూడా టిడిపి కార్యాలయంలోనే తయారు అయిందని ఎద్దేవా చేశాడు.