వైసీపీ మంత్రి కొడాలి నాని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని తన కుల మీడియాతో.అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి అభివృద్ధి అదేవిధంగా.సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ పై.ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని.కచ్చితంగా వైయస్ జగన్ రాష్ట్రంలో 30 సంవత్సరాలు పరిపాలన చేస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలు అవటానికి కారణం చంద్రబాబు అని మండిపడ్డారు.ఇక ఇదే సందర్భంలో కుప్పం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తాం అని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారు.
నిజంగా చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతాను అంటూ కొడాలి నాని ఛాలెంజ్ విసిరారు.ఇదే సందర్భంలో హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం.అవుటర్ రింగ్ రోడ్డు తానే నిర్మించినట్లు.గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.
వాటికి సంబంధించి నిర్మించినట్లు ఆధారాలు చూపితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.కొడాలి నాని చంద్రబాబుకి సవాల్ విసిరారు.