మంచి భవిష్యత్తు ఉన్న యువతి యువకులు ప్రేమ మాయలో పడి, వాళ్ల జీవితాల్లో చీకటి వెలుగుల దారులను చూడకుండానే, కష్టసుఖాలు అనుభవించకుండానే, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ప్రేమే లోకం అని భావించి కన్న వారికి కడుపుకోత పెడుతున్నారు.
ఇలా ఎందరో ఏం సాధించకుండానే ఈ మట్టిలో కలిసి పోతున్నారు.
ఇకపోతే తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడలో కూడా ఓ ప్రేమ జంట మరణం కలకలం రేపింది.
ఆ వివరాలు చూస్తే.స్దానికంగా నివాసముండే యువతి, యువకుడు కనిపించడం లేదంటూ గురువారం కోదాడ పోలీసులకు వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారట.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చెరువులో రెండు మృతదేహాలు కనిపించాయని స్దానికులు ఇచ్చిన ఫిర్యాదుతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారట పోలీసులు.
ఈ విషయాన్ని మిస్సైన యువతి యువకుని కుటుంబ సభ్యులకు కూడా తెలియచేయడంతో, వారు కూడా ఆ చెరువు వద్దకు వెళ్ళారట.ఇక మృతదేహాలను చెరువులోంచి బయటకు తీయగా, ఆ మృతదేహలు తాము వెతుకున్న యువతీ యువకుడివే అని పోలీసులతో పాటుగా ఆ కుటుంబసభ్యులు గుర్తించారట.
కాగా ఈ మృతికి కారణాలు తెలియరాలేదు.కానీ ప్రేమ వ్యవహారం వల్లనే వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తూ ప్రారంభించారట.