ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం కెజియఫ్.ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం కెజియఫ్2.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇలా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా పై నటుడు సిద్ధార్థ్ స్పందించి ఫన్నీ కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన నటించిన హిందీ వెబ్ సిరీస్ఎస్కేప్ లైవ్ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా పాన్ ఇండియా సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కెజియఫ్2 సినిమాని పాన్ ఇండియా సినిమా అంటే చాలా ఫన్నీగా ఉందంటూ ఈయన షాకింగ్ కామెంట్ చేశారు.గత 15 సంవత్సరాల నుంచి తాను పలు భాషలలో సినిమాలు చేస్తున్నానని ఏ భాషలో కూడా ఇతరులతో డబ్బింగ్ చెప్పకుండా తానే డబ్బింగ్ చెప్పానని సిద్ధార్థ్ వెల్లడించారు.ఇలా నా వరకు ఆ సినిమాలన్నింటిని ఇండియన్ ఫిలిమ్స్ అని పిలవడమే ఇష్టమని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందీ భాషలో ఒక సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంటే దానిని బాలీవుడ్ సినిమా అని పిలుస్తాము.కానీ ప్రాంతీయ చిత్రాలు విడుదలయ్యి విశేష ఆదరణ పొందితే ఆ సినిమాలను పాన్ ఇండియా అని ఎందుకు పిలుస్తున్నారు? ఆ సినిమాలను భారతీయ చిత్రమని పిలవచ్చు కదా అంటూ ప్రశ్నించారు.కెజియఫ్ సినిమా జర్నీ గౌరవించి దానిని కన్నడ సినిమా అని పిలవచ్చు లేదా ఇండియన్ సినిమా అని చెప్పొచ్చు కానీ పాన్ ఇండియా అనడం ఏంటో నాకు అర్థం కావడం లేదు.ఆ పదం వినడానికే చాలా ఫన్నీగా ఉందంటూ ఈయన పాన్ ఇండియా సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.