జైల్లో పెట్టినా హుజురాబాద్ లో ఈటలను గెలిపిస్తాం: కిషన్ రెడ్డి

హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.రాజకీయ కక్షతో ఈటలను వేధిస్తున్నారని అక్రమంగా జైల్లో ఉంచినా సరే హుజూరాబాద్ లో గెలిపిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

 Kishan Reddy Targets Trs Party, Kishan Reddy , Party Targets , Telangana, Trs ,-TeluguStop.com

మంచి, నీతివంతమైన, కమీషన్లు లేని, ప్రజల ప్రజాస్వామ్యం బీజేపీ ఇస్తుందని అన్నారు.ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికగా హుజూరాబాద్ ఎన్నికలు భావిస్తున్నామని అన్నారు కిషన్ రెడ్డి.

తెలంగాణా ఉద్యమకారులకు, అవకాశం వాదులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు.ప్రజాస్వామ్యానికి, అప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధమని ఈ యుద్ధంలో ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు ఎటు నిలబడతారో తేల్చుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు.

టీ.ఆర్.ఎస్, బీజేపీల మధ్యే హుజూరాబాద్ లో ప్రధాన పోటీ అని.టీ.ఆర్.ఎస్ కు వ్యతిరేకంగా పోరాడే పార్టీ బీజేపీనే అని అన్నారు కిషన్ రెడ్డి.కాంగ్రెస్ నిన్నటి పార్టీ దానికి రేపు అన్నది లేదని అన్నారు.బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి అందుకు కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలని అన్నారు.బహ్విష్యత్ మనదే అంటూ కిషన్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కరోనా టైం లో బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూశాయని.

తెలంగాణాని అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube