కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి మొన్న ఏపీలో శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.
కాగా ఈ రోజు ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకడం జరిగింది.
దర్శనం అనంతరం కొండపై పునర్నిర్మిస్తున్నారు ప్రధాన ఆలయ పనులను పరిశీలించారు.ఇదిలా ఉంటే ఈ రోజు హైదరాబాద్ నగరంలో జన ఆశీర్వాద యాత్రలతో పలుచోట్ల కిషన్రెడ్డి ప్రసంగించనున్నారు.ఈ గ్రామంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ఉప్పల్ రింగ్ రోడ్డు కి చేరుకోనున్న క్రమంలో బిజెపి శ్రేణులు ఘన స్వాగతం పలకడానికి రెడీ అయ్యాయి.ఆ తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.
యాత్ర జరగనుంది.చివరిగా హైదరాబాద్ బిజెపి కార్యాలయం వద్ద భారీ బహిరంగ సభలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.