ఏపీలో బీజేపీ పరిస్థితి ఆ పార్టీ హైకమాండ్ కు కూడా అర్థం కావడం లేదు.ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ, ఉన్న సమయంలో టిడిపితో ఎక్కువగా సన్నిహితంగా మెలుగుతున్నారు అని, ఆయన అధ్యక్షుడు గా ఉంటే ఏపీలో బీజేపీ బలపడడం కష్టం అనే అభిప్రాయంతో, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు.
ఇక ఆయన సారథ్యంలో మొదట్లో బిజెపిలో కొత్త ఉత్సాహం కనిపించే విధంగా పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేకూర్చే వారందరినీ బయటకు పంపించారు.పూర్తిగా బిజెపి భక్తులను మాత్రమే ఆ పార్టీలో ఉండే విధంగా సోము వీర్రాజు వ్యవహరించేవారు.
కఠిన నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని ఒక గాడిలో పెట్టారు. కాకపోతే బిజెపిలో అనే గ్రూపులో ఉండడం , ఎవరికి వారు తామే ఆధిపత్యం చెలాయించాలి అన్నట్లుగా వ్యవహరిస్తుండడం, ఒకే విషయంపై ఏపీ బీజేపీ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం మరింత ఇబ్బందికరంగా మారింది.
కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి, సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ జీవీఎల్ నరసింహారావు సోము వీర్రాజు , ఇలా చెప్పుకుంటూ వెళితే ఎవరికి వారు తామే గొప్ప నాయకులం అన్నట్లు వ్యవహరిస్తూ, ఏపీ బీజేపీ ని మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.ఈ వ్యవహారాలను బీజేపీ అధిష్టానం గుర్తించే కేంద్ర మంత్రి, తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి ఏపీ బీజేపీ బాధ్యతలను పర్యవేక్షించాల్సిందిగా బాధ్యతలు అప్పగించింది.
కిషన్ రెడ్డికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపిని లీడ్ చేసిన అనుభవం ఉండటం , ఏపీ పరిస్థితుల గురించి ఆయనకు బాగా అవగాహన ఉండటం తదితర కారణాలతో ఆయన అయితేనే పార్టీని ఒక గాడిలో పెట్టగలరనే నమ్మకంతో కిషన్ రెడ్డికి ఈ బాధ్యతలను బిజెపి హైకమాండ్ అప్పగించింది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉన్నా, ఆయన మాత్రం పార్టీ నాయకులను పెద్దగా లెక్క చేయడం లేదనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ బాధ్యతను అప్పగించి, ఏపీలో బిజెపిని పరుగులు పెట్టించే వ్యూహానికి బీజేపీ సైతం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. త్వరలోనే కిషన్ రెడ్డి ఏపీ బీజేపీ ని ప్రక్షాళన చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
.