తెలంగాణ బీజేపీలో ఇప్పుడు వర్గ పోరు అనేది చాలా పీక్స్లో ఉంది.మొన్నటి వరకు కొంత తక్కువగా అన్నట్టు కనిపించినా అది ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తోంది.
ఇక మరీ ముఖ్యంగా సీనియర్ నేత ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్రెడ్డి అలాగే ఇప్పుడు ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మధ్యనే ఇది ప్రధానంగా కనిపిస్తోంది.ఇక మొన్నటికి మొన్న పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పాదయాత్ర చేస్తానని ప్రకటించగానే.
ఎక్కడ పార్టీలో తన ఇమేజ్ డౌన్ అవుతుందో అనే ఆలోచనతో వెంటనే జనాశీర్వాద యాత్రను కిషన్రెడ్డి ప్రారంభించేశారు.
ఇక రాష్ట్రంలోని పార్టీకి పట్టులేని ప్రాంతాల్లో కిషన్రెడ్డి యాత్ర సాగుతోంది.
మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఇది కీలకంగా కనిపించడంతో ఎక్కడైతే బండి సంజయ్ ఇమేజ్ తక్కువగా ఉంటుందో అక్కడ కిషన్రెడ్డి తన ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.అంటే అంతిమంగా పార్టీ విషయాల్లో తన నిర్ణయమే ఫైనల్ అనే విషయాన్ని కింది స్థాయి కార్యకర్తలకు తెలియజేయాలని కిషన్రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే ఈ మధ్య పార్టీలో ఉంటున్న కీలక నేతంలందరూ కూడా బండి సంజయ్ నాయకత్వం వైపే మొగ్గు చూపుతుండటంతో కిషన్రెడ్డి అలర్ట్ అయ్యారు.
పార్టీ కార్యకర్తల్లో తన ఇమేజ్ను పెంచుకుంటే ఆటో మేటిక్ గా పెద్ద స్థాయి నాయకులు కూడా తన వైపు ఉంటారనేది కిషన్రెడ్డి ప్లాన్ అన్నట్టు తెలుస్తోంది.ఇక ఇప్పటికే రాజకీయ పరంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పైకి చెప్తున్నా కూడా ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు అనేది ఇప్పుడు చాలా స్పస్టంగా కనిపిస్తోంది.ఇక ఈటల రాజేందర్ గనక గెలిస్తే ఆ క్రెడిట్ బండి సంజయ్ ఖాతాలోకి వెళ్తుందనే ప్లాన్లో కిషన్రెడ్డి తన యాత్రను హుజూరాబాద్ లో కూడా నిర్వహించారు.
ఇక రాబోయే రోజుల్లో హుజూరాబాద్ లో కూడా కీలకంగా ప్రచారం చేస్తారని తెలుస్తోంది.