ఇటీవల సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జేబీఎస్ నుండి ఎంబీబీఎస్ వరకు మెట్రో రైలు మార్గం మొదలైన విషయం తెల్సిందే.ఈ కార్యక్రమంలో ప్రొటో కాల్ ప్రకారం బీజేపీ నేతలను ఆహ్వానించలేదు అంటూ ఆ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు జరుగుతున్న సమయంలో ఎలా మెట్రో రైలు లైన్ ప్రారంభ కార్యక్రమం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.మెట్రో అధికారులు రాష్ట్ర ప్రభుత్వంకు తలొగ్గిందా అంటూ ప్రశ్నించాడు.
రేపు మెట్రో అధికారుతో కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలను వెళ్లడిరచాలంటూ ఆదేశించాడు.
రేపు జరుగబోతున్న సమీక్ష కార్యక్రమంలో బీజేపీ నాయకులను ఆహ్వానించక పోవడంపై మెట్రో అధికారులకు కిషన్ రెడ్డి క్లాస్ పీకే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.కేసీఆర్ కావాలనే పార్లమెంటు జరుగుతున్న సమయంలో ప్రారంభోత్సవం పెట్టారంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.