తెలంగాణలో ప్రస్తుతం రాజకీయం మొత్తం ఈటెల చుట్టూనే తిరుగుతోంది.హుజురాబాద్ ఉప ఎన్నిక అనేది ఇటు అధికార పార్టీకి, ఇటు బీజేపీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారిందన్న విషయం విదితమే.
అయితే ఈటెల టీఆర్ఎస్ ను వీడిన తరువాత మొదట కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిపినా, చివరికి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.అయితే మిగతా రాజకీయ పార్టీల శైలి వేరు.
బీజేపీ శైలి వేరు.మతం ఆధారంగా రాజకీయాలు చేసే పద్దతి బీజేపీలో ఉంటుందన్న విషయం తెలిసిందే.
అయితే బీజేపీలో భావజాలానికి అలవాటు పడి సిద్దాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరే వారికి బీజేపీ తరహా రాజకీయం చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.కాని వేరే ఇతర రాజకీయ పార్టీల నుండి బీజేపీ లో చేరిన వారికి బీజేపీ సిద్దాంతాల గురించి అవగాహన ఉండదు.
ఇక అసలు విషయంలోకి వస్తే టీఆర్ఎస్ లో రకరకాల కారణాల వల్ల బీజేపీలో చేరిన ఈటెల వ్యవహారశైలి పట్ల కొంత మంది బీజేపీ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.మాజీ మంత్రి ఈటెల స్వతహాగా కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి కావున రాజకీయంగా అనివార్య కారణాల వల్ల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.అయితే హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పార్టీ లైన్ ను దాటి వ్యక్తిగత ఎజెండాతోటే ముందుకెళ్తున్నారని కొంత మంది నేతలు ఈటెలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపించిన పరిస్థితి ఉంది.అయితే తాజాగా తెలంగాణ విమోచన దినం సందర్భంగా నిర్మల్ లో జరిగిన సభలో అమిత్ షా పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో ఈటెలకు చెవిలో స్పీచ్ చివరిలో భారత్ మాతాకీ జై అని చెప్పి ముగించండి అని చెప్పినట్టు పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి.దీంతో ఈటెలకు బీజేపీలో ఉండడం ఇష్టం లేదు అనే ప్రచారం చేస్తున్న వారికి ఆ సమావేశం నుండే ఒక సందేశం ఇచ్చినట్టయింది.