తెలంగాణ సీఎం కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.రిపబ్లిక్ డే వేడుకలపై తెలంగాణ సర్కార్ తీరు సరిగా లేదన్నారు.
రిపబ్లిక్ డే వేడుకలు జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.జీ-20 సదస్సుకు సీఎం కేసీఆర్ ను ఆహ్వానించినా రాలేదని తెలిపారు.రాష్ట్రానికి ప్రధాని వస్తే కనీస గౌరవం ఇవ్వరన్న ఆయన గవర్నర్ ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఉండదన్నారు.దేశానికో విధానం, తెలంగాణకో విధానం ఉందని వెల్లడించారు.కేసీఆర్ కుటుంబం కారణంగా తెలంగాణ నష్టపోతోందని ఆరోపించారు.