నటి కీర్తి సురేష్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.హీరోయిన్ గా సినీ పరిశ్రమలో రాణిoచాలంటే గ్లామర్ షో చేయాల్సిందేనని ప్రగాఢంగా భావిస్తారు.
కాని ఆది వాస్తవం కాదనేది.చాలా మంది హీరోయిన్ ల విషయంలో రుజువైంది.
నటి ఆమని ఇలా చాలా మంది హీరోయిన్ లు తెల్లతోలు లేకపోయినా తమ నటనతో ఇండస్ట్రీలో అద్భుతంగా రాణించి పరిశ్రమలో తమదైన ముద్ర వేశారు.అయితే ఇప్పడు సినీ పరిశ్రమకు వస్తున్న హీరోయిన్ లు గ్లామర్ షోకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.
అయితే అందులో నుండి మినహాయింపు ఇవ్వవలసింది నటి కీర్తి సురేష్ కి అని చెప్పవచ్చు.నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ సినిమా హిట్ తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో అద్భుత నటనతో ప్రేక్షకులను మాత్రమే కాదు ఇండస్ట్రీ జనాలను ఒక్కసారిగా అబ్బురుపరిచింది.
ఇక మహానటి హిట్ తో ఇక కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ఇక తెలుగు, తమిళం, హిందీ సినిమాలను లైన్ లో పెట్టి ఫుల్ బిజీగా మారిపోయింది.అయితే తాజాగా నితిన్ హీరోగా వచ్చిన రంగ్ దే సినిమాలో హీరోయిన్ గా నటించింది.
తాజాగా రంగ్ దే సినిమా ప్రమోషన్లలో భాగంగా రకరకాల వీడియోలను విడుదల చేశారు.తాజాగా కీర్తి సురేష్ విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఏటో వెళ్తుండగా ఆలస్యం అయినట్టు బోటు వెళ్ళిపోతుందని తెలిసి కంగారుపడుతూ కీర్తి సురేష్ పరుగెత్తుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోపై కీర్తి అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక కీర్తి అభిమానుల కామెంట్స్ తో ఈ వీడియో మరింత వైరల్ గా మారుతోంది.ఇక ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను చూసేయండి మరి.