సూపర్ స్టార్ మహేష్ బాబు “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.బ్యాంకు రోబరీ తరహాలో ఈ సినిమా స్టోరీ ఉండ బోతున్నట్లు, అందుకోసమే మహేష్ న్యూ లుక్ మెయింటెన్ చేస్తున్నట్లు ఎప్పుడూ లేని విధంగా టాటూలతో సినిమాలో తన మేక్ఓవర్ మార్చుకున్నట్లు ఇండస్ట్రీలో ఇప్పటికే ఈ సినిమా గురించి టాక్ నడుస్తోంది.
ఇటువంటి తరుణంలో ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కీర్తి సురేష్ కూడా సరికొత్త ప్రయోగం చేయడానికి రెడీ అయినట్లు ఫిలిం వర్గాల నుండి అందుతున్న సమాచారం.మేటర్ లోకి వెళ్తే సినిమా లో పాత్ర కోసం బరువు పెరగాలని కీర్తి సురేష్ కి డైరెక్టర్ పరుశురాం ఇటీవల తెలియజేయడంతో.బరువు పెరిగే ఆలోచనలో ఈ మహానటి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
సినిమాకి సంబంధించి షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు.
త్వరలోనే దుబాయిలో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట.ఈలోపు కీర్తి సురేష్ బరువు పెరిగే ప్రయోగాలు చేస్తున్నట్లు ఫిలిం వర్గాలలో టాక్.
దీంతో లావు పెరిగితే ఈ మహానటి ఎలా ఉంటుందో అని అభిమానులు కొద్దిగా భయపడుతున్నారు.