ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో శుక్రవారం భేటీ అయ్యారు.గత మూడు రోజుల నుండి ఢిల్లీలోనే మకాం వేసిన కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం సోనియా గాంధీతో భేటీ కావడం జరిగింది.
భేటీ అనంతరం హైదరాబాద్ కి తిరిగి పయనమయ్యారు.చాలా కాలం తర్వాత మళ్లీ కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా యాక్టివ్ అవుతూ ఉండటంతో.
ఈ భేటీ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది.
మరోపక్క వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీకి వెళ్లినట్లు కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
సోనియాతో దాదాపు 45 నిమిషాల పాటు కిరణ్ కుమార్ రెడ్డి వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం.ఇటీవలె తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన చేపట్టడం జరిగింది.ఈ క్రమంలో ఇప్పుడు ఢిల్లీలో సోనియా గాంధీతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కావడం.పట్ల చూస్తే ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పూర్తిగా.
కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.