మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.బాక్సింగ్ నేపధ్యంలో ఈ సినిమా కాన్సెప్ట్ ని దర్శకుడు చెప్పబోతున్నాడు.
ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.ఇక కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్రలో సినిమాలో కనిపించబోతున్నాడు.
అలాగే జగపతిబాబు కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథని నేరేట్ చేస్తున్నాడు.
ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ని దర్శకుడు కంప్లీట్ చేశాడు.ఇదిలా ఉంటే లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగ్ వాయిదా పడింది.
అలాగే హైదరాబాద్ ఈ మూవీ కోసం 50 లక్షల రూపాయిలతో ప్రత్యేకంగా వేసిన సెట్ ని కాస్తా తొలగించారు.దీంతో ఈ సినిమా విషయంలో దర్శకుడు కిరణ్ కి, వరుణ్ తేజ్ కి అభిప్రాయబేధాలు వచ్చాయని టాక్ ప్రచారంలోకి వచ్చింది.
ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ ఏదీ కూడా వరుణ్ తేజ్ కి నచ్చలేదని, దీంతో స్క్రిప్ట్ మార్చాలని కిరణ్ కి వరుణ్ తేజ్ సూచించాడని, దానికి అతను ఒప్పుకోలేదని గాసిప్స్ వినిపించాయి.ఈ నేపధ్యంలో ఇప్పుడు గని షూటింగ్ సందిగ్ధంలో పడిందని, వరుణ్ తేజ్ ఎఫ3 మూవీ మీద కంప్లీట్ గా ఫోకస్ పెట్టాడని చెప్పుకొచ్చారు.
అయితే ఈ వార్తలపై దర్శకుడు తాజాగా క్లారిటీ ఇచ్చాడు.వరుణ్ తేజ్ కి తనకి మనస్పర్ధలు వచ్చినట్లు ప్రచారం అవుతున్న వార్తలలో వాస్తవం లేదని చెప్పాడు.
అలాగే సినిమా షూటింగ్ మెజారిటీ భాగం పూర్తయ్యిందని మరో 30 నుంచి 40 రోజుల షెడ్యూల్ మాత్రమే పెండింగ్ లో ఉందని చెప్పడు.వాస్తవాలు తెలియకుండా ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అన్నారు.
ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ విషయంలో కూడాఅందరూ సంతృప్తిగా ఉన్నారని క్లారిటీ ఇచ్చాడు.
.