రాజా వారు రాణి గారు, ఎస్.ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో మెప్పించిన యువ హీరో కిరణ్ అబ్బవరం తన థర్డ్ సినిమా సెబాసిటర్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఫిబ్రవరి 25న థియేట్రికల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా డిజిటల్ రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు.సెబాస్టియన్ సినిమాను ఆహా ఓటీటీలో డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు.
థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా ఆహాలో రానుంది.మాములుగా ఒక సినిమా థియేటర్ లో రిలీజై 50 రోజులు పూర్తి చేసుకున్నాక డిజిటల్ రిలీజ్ చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు.
కిరణ్ అబ్బవరం మంచి దూకుడు మీద ఉన్నాడు.వరుస సినిమాలతో యువ హీరో దూసుకెళ్తున్నాడు.
సెబాస్టియన్ తర్వాత గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.ఆ సినిమాకు టైటిల్ గా వినరో భాగ్యము విష్ణు కథ సినిమా చేస్తున్నారు.
యువ హీరోల్లో వరుస సినిమాలతో తన దూకుడు చూపిస్తున్న కిరణ్ తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.బాలాజి సయ్యపురెడ్డి డైరెక్ట్ చేసిన సెబాస్టియన్ మూవీలో నువేక్ష హీరోయిన్ గా నటించింది.