టీడీపీలో సంచలన విషయం చర్చకు వచ్చింది.ఒకవైపు పదవులు దక్కక నాయకులు పార్టీలు మారుతున్న సమయంలో పదవులు ఇస్తామంటే.
కింజరాపు కుటుంబం విముఖత వ్యక్తం చేస్తోందనే వార్తలు వస్తున్నాయి.పైగా బాబు ఇచ్చిన ఆఫర్లనే వద్దని కింజరాపు కుటుంబం చెబుతున్నట్టు తమ్ముళ్ల మధ్య చర్చనడుస్తోంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు ఎర్రన్నాయుడి నుంచి ఇప్పటి వరకు ఈ కుటుంబం టీడీపీకి అంకితమైంది.ఎర్రన్నాయుడు, ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు.
ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్నాయుడు, కుమార్తమె.ఆదిరెడ్డి భవానీలు.
టీడీపీలోనే ఉన్నారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరిలో అచ్చెన్నాయుడికి.
.చంద్రబాబు.
రాష్ట్ర టీడీపీ చీఫ్ ఛాన్స్ ఇస్తున్నారని రాష్ట్రంలో కీలకమైన ఓ మీడియాలోనే వార్తలు వచ్చాయి.చంద్రబాబు స్వయంగా అచ్చెన్నతో మాట్లాడారని ఆయనకు అన్ని విధాలా భరోసా ఇచ్చారని, ఆయన ఇష్టప్రకారమే.
పార్టీని నడిపించవచ్చని కూడా బాబు ఫ్రీహ్యాండ్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.దీంతో ఇక, రేపోమాపో.
అచ్చెన్న.పగ్గాలు అందుకోవడమే తరువాయి అనుకున్నారు.
ఇక, తెలుగు యువత రాష్ట్ర చీఫ్ పదవి కూడా ఖాళీగా ఉంది.గతంలో ఈ పదవిలో ఉన్న దేవినేని అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఈ పదవి అప్పటి నుంచి ఖాళీగా ఉండిపోయింది.
దీంతో ఈ సీటును శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి అప్పగించాలని చంద్రబాబు భావించారట.అంటే.అటు టీడీపీ అధ్యక్ష పగ్గాలతోపాటు.యువత పగ్గాలు కూడా కింజరాపు ఫ్యామిలీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే, ఆయా పదవులు తీసుకునేందుకు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు కూడా తిరస్కరించినట్టు తాజాగా తమ్ముళ్ల మధ్య చర్చ జరుగుతుండడం గమనార్హం.మరి దీనికి రీజన్ ఏంటి? ఏం జరిగింది? ఒకవైపు పదవులు దక్కక నాయకులు ఉంటే.ఇప్పుడు వీరు పదవులు ఇస్తామన్నా తీసుకోక పోవడం వెనుక ఆంతర్యమేంటి? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
అయితే, రాష్ట్రంలో పార్టీ పూర్తిగా చతికిలపడిన నేపథ్యంలో తామెందుకు ఈ బాధ్యతలు భుజాన వేసుకోవాలని వారు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుండగా.
తమకు ఎదురైన పరాభవాల విషయంలో చంద్రబాబు వైఖరితో ఈ కుటుంబం కలచి వేసిందని మరికొందరు అంటున్నారు.మొత్తానికి బాబుతో కింజరాపు ఫ్యామిలీకి గ్యాప్ పెరుగుతోందని అంటున్నారు.పార్టీ నుంచి బయటకు రాకపోయినా.అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తారని చెబుతున్నారు.
మరి ఏం జరుగుతుందో చూడాలి.