కింగ్ నాగార్జున సంక్రాంతికి తన సినిమా బంగార్రాజుని రిలీజ్ చేస్తున్నారు.ఏపీలో టికెట్ల రేట్ల ఇష్యూ నడుస్తున్నా సరే అదేమి తన సినిమాకు అడ్డు కాదని.
టికెట్ల రేట్లు ఎక్కువ ఉంటే కొద్దిగా డబ్బులు ఎక్కువగా వస్తాయని అన్నారు.అంతేకాదు సినిమా ఈవెంట్ లో రాజకీయాలు అసలు మాట్లాడను అని అన్నారు.
టాలీవుడ్ సినీ పెద్దలంతా ఏపీ టికెట్ల వ్యవహారంపై హడావిడి చేస్తుంటే నాగార్జున ఇలా తన సినిమాకు టికెట్ల రేట్లు ఎలాంటి ఇంప్యాక్ట్ చూపించవు అని చెప్పడం షాకింగ్ గా ఉంది.అయితే ఇదే నాగార్జున రగడ సినిమా టైం లో ఇండస్ట్రీ గురించి ప్రభుత్వం ఆలోచించాలని.
ప్రభుత్వం తమ సపోర్ట్ ఇవ్వాలని గొంతెత్తి చెప్పారు.
అప్పుడు కూడా సినిమా వేడుకలోనే సినిమా రాజకీయం మాట్లాడిన నాగార్జున ఇప్పుడు టికెట్ల రేట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడలేదని ట్రోల్ చేస్తున్నారు.
అంతేకాదు అప్పటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాగార్జున మారిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు.మరి అప్పుడు నాగార్జున అలా మాట్లాడి.
ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడారో ఆయనకే తెలియాలి. బంగార్రాజు సినిమాలో నాగార్జునతో పాటుగా నాగ చైతన్య, కృతి శెట్టి నటించారు.