ఉత్తర కొరియా నియంత నేత కిమ్ జాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కఠినత్మకమైన నిర్ణయాలతో దేశ ప్రజలను అణగదొక్కే రీతిలో పరిపాలించే నేతగా అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కిమ్ జాంగ్.
ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అనే రీతిగా వ్యవహరిస్తూ ఉంటారు.ప్రపంచం లోకి కరోనా వచ్చిన ప్రారంభంలో ఉత్తర కొరియా లో ఎవరికైనా పాజిటివ్ వస్తే చంపేస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ రీతిగా వ్యవహరించే కిమ్.ప్రపంచ సూపర్ పవర్ కంట్రీ అమెరికా విషయంలో కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇదే రీతిలో కిమ్ సోదరి కూడా వ్యవహరిస్తూ వస్తోంది.ఇటీవల దక్షిణ కొరియా.అమెరికా సైన్యం తో విన్యాసాలు చేయడానికి రెడీ అవటంతో ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ జో తీవ్రస్థాయిలో దక్షిణ కొరియా కి వార్నింగ్ ఇచ్చింది.అమెరికా తో సైనిక విన్యాసాలు రద్దు చేసుకోవాలని సౌత్ కొరియా కి తెలిపింది.
లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని…తుది నిర్ణయం దక్షిణ కొరియా పైనే ఆధారపడి ఉంది అంటూ ఆమె తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తే ఇరు దేశాల సంబంధాలు పై ఆ ప్రభావం గట్టిగా పడుతుంది అంటూ కిమ్ సోదరి సౌత్ కొరియా కి తాజాగా తెలియజేయడం జరిగింది.