అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగితేనే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చినట్లు అన్న మాటలకు హీరోయిన్ ప్రాక్టికల్ చేసి చూపించింది.నిజంగా ఒకప్పటి నటి కిమ్ శర్మ గుర్తు ఉండే ఉంటుంది.
బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో కూడా ఒక మెరుపు మెరిసిన ఈ ముద్దుగుమ్మ ముంబై బాద్రా లో ఒక ఆటోలో కనిపించి అందరిని ఆశ్చర్యపరచింది.టాలీవుడ్ లో ప్రముఖ డైరక్టర్ కృష్ణ వంశీ సినిమాల్లో దిబెస్ట్ మూవీ గా చెప్పుకొనే ఖడ్గం చిత్రంలో నటించిన కిమ్ శర్మ ఆతరువాత కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది.
ఆ తరువాత ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ప్రేమాయణం కూడా నడిపిన ఈ ముద్దుగుమ్మ తరువాత పెళ్లి చేసుకుంది.అయితే అతడితో కొన్నేళ్ల కే విడిపోయిన కిమ్ ఆతరువాత హీరో హర్షవర్ధన్ రానాతో సహజీవనం చేసింది.
ఆ తరువాత ఇద్దరికీ కుదరక విడిపోయారు.అయితే అప్పటి నుంచి కిమ్ ఒంటరిగానే ఉంటుంది.
అయితే పెళ్లి తరువాత ఆమె స్క్రీన్ కు దూరంగానే ఉంటున్నారు.
అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా కనిపిస్తూ తన ఉనికిని చాటుకుంటున్న ఈ భామ అర్ధరాత్రి ఇలా బాద్రా లో ఒక ఆటోలో కనిపించడం విశేషం.మొదట ఆమెను చూసి ఎవరో అనుకున్నారు కానీ ఆ తరువాత కిమ్ ని గుర్తు పట్టిన సినిమా ఫొటోగ్రాఫర్లు ఆమె ఫోటోలు తీశారు.ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అయితే ఇంతకీ ఈ భామ కు అర్ధరాత్రి ముంబై వీధుల్లో పనేంటో ఎక్కడకి ఆ సమయంలో వెళుతుందో అన్న విషయం మాత్రం తెలియదు.