కరోనా పేరు చెప్పగానే ప్రపంచదేశాల్లో వణుకు మొదలవుతుంది.దేశ దేశాలకు పాకుతూ పోతున్న ఈ మహమ్మారి ని కట్టడి చేయాలి అని అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అంతకు మరింతగా ఈ వైరస్ ప్రబలుతూనే ఉంది.
అయితే ప్రపంచ దేశాలలో ఆయన పేరు వింటేనే వణుకు పుడుతుంది.అలాంటి వ్యక్తి ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తుతం కనిపించడం లేదు.
అగ్రరాజ్యానికే ప్రత్యక్ష్యంగా పరోక్షంగా వణుకు పుట్టించిన కిమ్ ఈ రోజు కనిపించకపోవడం తో అసలు ఆయనను భయపెట్టింది ఎవరూ అన్న ప్రశ్న తలెత్తింది.ఆయన ఎవరు భయపెట్టారు.
అసలు ఏ కారణంగా ఆయన కనిపించకపోయారు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే వాటన్నిటికీ ఒకటే సమాధానం కిమ్ కనిపించకుండా ఉండడానికి అసలు కారణం కరోనా.
ఈ కరోనా మహమ్మారి కి భయపడే కిమ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట.ఎంతో ధైర్యశాలి గా పేరు గడించిన కిమ్ ఇలా కరోనా భయం తో పత్తా లేకుండా పోయారు.
ప్రాణభయంతో జడుసుకొని రాజధాని విడిచి వెళ్లిపోయారు.ఆ మహమ్మారితో ఎందుకు అనుకున్నాడేమో తీర ప్రాంత నగరానికి పారిపోయాడు.
ఎవరికీ కనిపించని విధంగా అత్యంత సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తుంది.ఆ మహమ్మారి కంట పడకుండా ఉండేందుకు కిమ్ ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం కిమ్ ఎక్కడ ఉన్నారు అన్న విషయం కేవలం కిమ్ ప్రభుత్వంలోని ఒకరిద్దరు ముఖ్యులకు తప్ప ఇంకెవరికి తెలియదు.
మిసైల్ టెస్టులతో అగ్రరాజ్యం అమెరికాను వణికించిన కిమ్ ఇలా అడ్రస్ లేకుండా పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.నార్త్ కొరియాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది.ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 180 మంది సైనికులు మృతి చెందినట్లు నార్త్ కొరియా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా కిమ్ రాజధాని ప్యాంగ్యాంగ్ సిటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని వాన్సన్ నగరానికి వెళ్లారన్న వార్తలు వినిపిస్తున్నాయి.మరి నియంత నేతగా పేరుగా కిమ్ ను సైతం అజ్ఞాతంలోకి నెట్టేసింది ఈ కరోనా మహమ్మారి.