ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యానికి గురైయ్యాడు.ఈ విషయాన్ని స్వయంగా కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపింది.
దీనికి దక్షిణ కొరియానే కారణమని ఆరోపించింది.కరోనా వైరస్ ను కరపత్రాల ద్వారా ఉత్తర కొరియాలోకి పంపిస్తున్నారని మండిపడింది.
అనంతరం యో జోంగ్ దక్షిణ కొరియాకు హెచ్చరికలు జారీ చేసింది.
వైరస్ ను ప్రవేశపెట్టే కరపత్రాలను మా రిపబ్లిక్ లోకి పంపే పనిని శత్రువులు మానుకోవాలి.
ఇది కొనసాగిస్తే వైరస్ ను మాత్రమే కాకుండా దక్షిణ కొరియా అధికారులను కూడా నిర్మూలించేలా మేం ప్రతిస్పందిస్తామని వార్నింగ్ ఇచ్చింది.ఈ విషయాన్ని అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
అయితే కిమ్ ఎప్పుడు అనారోగ్యానికి గురయ్యారు.ఆయన జ్వరానికి కారణం ఏంటన్నది తెలియలేదు.