కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈగ సినిమాతో టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టాడు.అలాగే తమిళ్, హిందీలలో కూడా సినిమాలు చేస్తున్నారు.
ఒక బాషకె పరిమితం కాకుండా సినిమాలు చేస్తూ ఉండటం వలన సుదీప్ కి అన్ని చోట్ల మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అతని సినిమా వస్తుంది అంటే చూడటానికి ఆసక్తి చూపించేవాళ్ళు ఉన్నారు.
ఇక తెలుగులో చివరిగా సైరా సినిమాలో చిరంజీవితో సమానమైన పాత్రలో సుదీప్ కనిపించాడు.కాస్తా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయిన మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఇదిలా ఉంటే సుదీప్ ఇతర బాషలలో ఇప్పటి వరకు హీరోగా సినిమాలు చేయలేదు.అయితే హీరోగా తన మార్కెట్ పరిధిని ఇప్పుడు పెంచుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.ఈ నేపధ్యంలో ఎప్పుడో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తాను ఇంకా వెయిట్ చేయడం ఎందుకని ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు.
ఇదిలా ఉంటే సాహో సినిమాతో పాన్ ఇండియా దర్శకుడుగా మారిపోయిన సుజిత్ ప్రస్తుతం హిందీలో విక్కీ కౌశల్ తో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకున్నాడు.ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.దీనికోసం సుజిత్ ఏకంగా ముంబైలో మకాం పెట్టేశాడు.ఈ సినిమా తర్వాత సుజిత్ ఏకంగా కిచ్చా సుదీప్ తో పాన్ ఇండియా రేంజ్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
దీనికోసం రీసెంట్ గా బెంగుళూరు వెళ్లి సుదీప్ కి కథ కూడా వినిపించినట్లు తెలుస్తుంది.యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్ తో కూడిన కథని సుదీప్ కి చెప్పడం జరిగిందని, ఆ కథ తనకి కూడా నచ్చడంతో పాన్ ఇండియా రేంజ్ లో లాంచింగ్ కి ఇదే సరైన ప్రాజెక్ట్ అని భావించి సుదీప్ ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.