కన్నడ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు కిచ్చా సుదీప్.కిచ్చా సినిమాతో అదే పేరుని తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు.
ఇక ఈగ సినిమాతో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి నటుడుగా సత్తా చాటాడు.తాజాగా చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు.
ఈ సినిమాలో అతని నటనకి కూడా మంచి గుర్తింపు వచ్చింది.సౌత్ ఇండియన్ యాక్టర్ గా సుదీప్ మారిపోయాడు.
ఇదిలా ఉంటే కిచ్చా సుదీప్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యాడు.ఫామ్ హౌస్ లో పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళ్లి ప్రత్యేకంగా కలిశారు.
దాదాపు గంట పాటు చాలా విషయాల గురించి చర్చించారు.ఇటీవలే సినిమా చిత్రీకరణలు ఊపందుకున్న క్రమంలో తాను నటిస్తున్న కొత్త సినిమాల గురించి పవన్ కు వివరించారు.
ఇద్దరు కూడా సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ పరిణామాల గురించి కూడా ఇద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తుంది.పవన్ ను కలిసిన సందర్భంగా కిచ్చ సుదీప్ కొన్ని మొక్కలను బహూకరించారు.
పవన్ కళ్యాణ్ ని కలిసిన విషయంపై కిచ్చ సుదీప్ ట్విట్టర్ లో స్పందించారు.ఎంతో నిరాడంబరంగా, ఎంతో నిగర్వంగా ఉండే మనిషి పవన్ కల్యాణ్, ఆయనకు నేను ఫిదా అయ్యాను అంటూ ట్వీట్ చేశారు.
మీతో మాట్లాడడం అద్భుతంగా ఉంది సర్ అంటూ స్పందించారు.మొత్తానికి పవన్ కళ్యాణ్, కిచ్చా సుదీప్ కలయిక రెండు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
కర్ణాటక లో పవన్ కళ్యాణ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.ఈ నేపధ్యంలో రాజకీయ అంశాలపై వీరిద్దరూ ఏమైనా చర్చించారా అనేది తెలియాల్సి ఉంది.
.