పెళ్లి తర్వాత మొదటిసారి ఎయిర్ పోర్ట్ లో సందడి చేసిన కియారా దంపతులు.. ఫోటో వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా ప్రేమలో విహరిస్తూ ప్రేమ పక్షులుగా ఉన్నటువంటి నటి కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా ఎట్టకేలకు ఫిబ్రవరి 7వ తేదీ పెళ్లి బంధంతో ఒకటిగా మారిపోయారు.వీరి వివాహం రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో మూడు రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

 Kiaras Couple Made A Noise At The Airport For The First Time After The Wedding T-TeluguStop.com

ఇక వీరి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.ఇకపోతే తాజాగా ఈ దంపతులు ఎయిర్ పోర్ట్ లో సందడి చేస్తూ కనిపించారు.

పెళ్లి అనంతరం ఈ దంపతులు జైసల్మీర్ నుంచి ఢిల్లీకి బయల్దేరినట్టుగా కనిపిస్తోంది.ఇక ఎయిర్ పోర్టులో ఈ కొత్త జంట అందరికీ అభివాదం చేస్తూ నవ్వుతూ కనిపించారు ఇలా పెళ్లి తర్వాత మొదటిసారి కనిపించడంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున వీరిని తమ సెల్ ఫోన్లలో బంధించడం కోసం ప్రయత్నాలు చేశారు.ఇక నటి కియారా మొహంలో పెళ్లి కళ ఉట్టిపడుతుంది.

ఈమె చేతుల నిండా మెహందీతో పాటు నుదుటిన కుంకుమతో కొత్తపెళ్లికూతురుగా చూడముచ్చటగా ఎంతో అందంగా ఉన్నారు.ఇలా పెళ్లి తర్వాత మొదటిసారి ఈ జంట బయట కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక కియారా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం ఈ సినిమా RC15 టైటిల్ తో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube