ప్రస్తుతం టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి “పుష్ప” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుండగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ మరియు లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు.అంతేకాక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పోస్టర్లు కూడా విడుదలకాగా మంచి రెస్పాన్స్ రాబట్టాయి.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించినటువంటి ఓ వార్త నెట్ లో తెగ వైరల్ అవుతుంది.ఇంతకీ ఆ వార్త ఏంటంటే టాలీవుడ్ లోకి వచ్చి రావడంతోనే స్టార్ హీరో మహేష్ బాబు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్ కియారా అద్వానీ ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
అంతేగాక ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు కియారా అద్వాని సంప్రదించారట.అయితే ఈ స్పెషల్ సాంగ్ లో నటించేందుకు కియారా అద్వానీ నటించడానికి ఒప్పుకుందా లేదా అనేది మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు తెలపడం లేదు.
దీంతో ఈ విషయంపై కొంత సందిగ్ధత నెలకొంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కియారా అద్వానీ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నటువంటి చిత్రంలో మహేష్ బాబు సరసన రెండవసారి నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.
అలాగే బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఈ అమ్మడు వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.