భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమా ల్లో నటించిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ తెలుగు లో ప్రస్తుతం రామ్ చరణ్ కు జోడీ గా నటిస్తున్న విషయం తెల్సిందే.శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయ్యింది.
మరో వైపు కిరాయా అద్వానీ హిందీ లో చాలా బిజీగా ఉంది.తాజాగా జగ్ జగ్ జియో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
హీరోయిన్ గా బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు దక్కించుకోవడం మాత్రమే కాకుండా వరుసగా సూపర్ హిట్స్ ను దక్కించుకుంటున్న ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు.హీరోయిన్ గా చేస్తున్న ఈ అమ్మడు తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల నుండి కూడా ఆఫర్లు దక్కించుకుంటుంది.
కాని ఇతర భాషల్లో ఈ అమ్మడు నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు.
కేవలం బాలీవుడ్ సినిమా లపై దృష్టి పెట్టిన ఈ అమ్మడికి జగ్ జగ్ జియో సినిమా సూపర్ హిట్ ను అందించడం తో ఇక తెలుగు లో కూడా ఈమె నటించేందుకు దొరికే అవకాశం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఒక మోస్తరు హీరోలతో నటించిన ఈ అమ్మడు ఇక నుండి స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.మొత్తానికి కియారా అద్వానీ తెలుగు లో ప్రస్తుతం చేస్తున్న చరణ్ మూవీ తో ముగించే అవకాశాలు ఉన్నాయని.
త్వరలోనే హిందీ లోనే మూడు నాలుగు సినిమా లు కమిట్ అయ్యి రాబోయే రోజుల్లో అక్కడే బిజీగా ఉంటుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ సినిమాకు జగ్ జగ్ జియో సక్సెస్ తో బాలీవుడ్ లో మంచి బిజినెస్ ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.