బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గురించి అందరికీ పరిచయమే.భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై తొలిసారి నటనతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తన అందంతో కూడా ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.ప్రస్తుతం పలు సినిమాలలో బాగా బిజీగా ఉంది.
సోషల్ మీడియాలో కూడా సమయాన్ని కేటాయిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఫస్ట్ క్రష్ గురించి బయట పెట్టేసింది.
2014లో ఫగ్లీ సినిమాతో తొలిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోగా ఆ తర్వాత ఎంఎస్ ధోని సినిమాలో కూడా నటించింది.
ఇక 2018 భరత్ అనే సినిమాతో వసుమతి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటే తను మరో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తో ప్రేమలో ఉన్నట్లు అందరికీ తెలిసిందే.
పైగా వీరిద్దరి మధ్య డేటింగ్ నడుస్తుందని కూడా తెలిసిందే.కానీ ఇదంతా పుకార్ అని గతంలో తెలుపుకొచ్చింది కియారా.
అంతేకాకుండా వీరిద్దరూ ఇటీవలే షేర్షా సినిమాలో కూడా నటించగా ఈ సినిమా ఇటీవలే ఓటీటీ వేదికగా విడుదలయింది.ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకుంది కియారా అద్వానీ.ఈ సినిమాలో తన పాత్ర తన మనసుకు నచ్చిందనిదేశం కోసం పోరాడే సైనికుడికి ప్రేయసిగా నటించినందుకు మంచి రెస్పాన్స్ వస్తుందని తెలిపింది.
ఇక తన వ్యక్తిగత విషయాల గురించి కొన్ని పంచుకుంటూ తనకు చిన్నప్పటి నుంచే బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఇష్టం అని తెలిపింది.సినీ నటులను దగ్గర నుండి చూశాను అంటూ తన చిన్నతనంలో తను మనసు పడ్డ హీరో హృతిక్ రోషన్ అని తెలిపింది.కహోనా ప్యార్ హై సినిమా తర్వాత తనకు హృతిక్ రోషన్ పై పెద్ద క్రష్ ఏర్పడిందనిఅతడే తనకు తొలి క్రష్ అని తెలిపింది.
ఇక తనకు సిద్ధార్థ మల్హోత్రా మంచి స్నేహితుడు మాత్రమే అని తెలిపింది.