భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తరువాత రామ్ చరణ్ తో వినయ విదేయ రామా సినిమాలో ఆదిపాడిన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ భామ అందాల ప్రదర్శనకి ఏ మాత్రం హద్దులు పెట్టకుండా ఫోటోగ్రాఫర్స్ కి కావాల్సిన స్టైల్ లో ఫోజులు ఇస్తుంది.
దర్శకులకి కావాల్సిన విధంగా అందాల విందు, రొమాంటిక్ ఇంటిమేట్ సన్నివేశాలు చేయడానికి రెడీ అంటుంది.అందుకే ఇప్పుడు బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే ఆ మధ్య ఈ అమ్మడు ఒక ఫోటో షూట్ లో టాప్ లెస్ ఫోజులు ఇచ్చి అందరిని ఒక్కసారిగా మెస్మరైజ్ చేసింది.వీటిని చూసిన తర్వాత సోషల్ మీడియాలో క్రియేటివ్ మేధావులు చాలా రకాల మీమ్స్ సృష్టించారు.
ఆకు చాటు అందాలని ఎడిట్ చేసి ఇష్టం వచ్చిన విధంగా మార్చేశారు.ఈ మీమ్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.ఇలాంటి మీమ్స్ హీరోయిన్స్ మీద వస్తే వాటిని బేసిగ్గా చాలా సీరియస్ గా తీసుకుంటారు.అయితే ఈ విషయంలో కూడా కియరా చాలా పోజిటివ్ గా రియాక్ట్ అయ్యింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో కియరా అద్వానీ ఆ అంశం గురించి స్పందించి.టాప్ లెస్ పోజు పై జరిగిన ట్రోలింగ్ తనను కూడా నవ్వించిందని ఈ హీరోయిన్ చెప్పింది.
అందుకు సంబంధించి మీమ్స్ తననూ ఎంటర్ టైన్ చేశాయని చెప్పింది.తన మీద వేసిన జోకులు ఫన్నీగా అనిపించాయని, వాటిని భాగా ఆస్వాదించానని చెప్పింది.
మొత్తానికి తనపై వచ్చిన ట్రోలింగ్ కూడా ఆస్వాదించడం ద్వారా మిగిలిన హీరోయిన్స్ కంటే తాను ప్రత్యేకం అని కియరా చెప్పుకునే ప్రయత్నం చేసిందని చెప్పాలి.